పంత్ విధ్వంసక సెంచరీ... ఆర్సీబీకి లక్నో భారీ సవాల్! ఐపీఎల్ 2025 సీజన్ లో..
Tue May 27, 2025 22:18 Sports
ఐపీఎల్ 2025 సీజన్ చివరి లీగ్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) భారీ స్కోరు సాధించింది. లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (118 నాటౌట్; 61 బంతుల్లో, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల కొండంత స్కోరును ఆర్సీబీ ముందుంచింది. మిచెల్ మార్ష్ (67; 37 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ జితేష్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన లక్నోకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్కే (14; 12 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) 25 పరుగుల వద్ద నువాన్ తుషార బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్తో కలిసి మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా పంత్ తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మార్ష్ కూడా వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఇది కూడా చదవండి: కూటమి ప్రభుత్వ లక్ష్యం అదే.. మంత్రి కీలక వ్యాఖ్యలు! అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..
ఈ జోడీ రెండో వికెట్కు ఏకంగా 152 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ భాగస్వామ్యాన్ని భువనేశ్వర్ కుమార్ విడదీశాడు. దూకుడుగా ఆడుతున్న మార్ష్ను జితేష్ శర్మ క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేర్చాడు. అనంతరం వచ్చిన నికోలస్ పూరన్ (13; 10 బంతుల్లో, 1 ఫోర్) ఎక్కువసేపు నిలవలేదు. రొమారియో షెపర్డ్ బౌలింగ్లో యశ్ దయాళ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే, మరో ఎండ్లో రిషభ్ పంత్ తన ప్రతాపాన్ని కొనసాగించాడు. పంత్ కేవలం 61 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో అజేయంగా 118 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి బంతికి అబ్దుల్ సమద్ (1 నాటౌట్) ఒక పరుగు తీయడంతో లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. ఆర్సీబీ బౌలర్లలో నువాన్ తుషార 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి ఒక వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు. భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. యశ్ దయాళ్ 3 ఓవర్లలో 44 పరుగులు ఇవ్వగా, సుయాశ్ శర్మ 3 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చాడు. కృనాల్ పాండ్యా 2 ఓవర్లలో 14 పరుగులిచ్చాడు. కాగా, సెంచరీ పూర్తయిన అనంతరం పంత్ బ్యాట్, హెల్మెట్ పక్కనపెట్టి ఓ పల్టీ కొట్టడం అందరినీ ఆకట్టుకుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఏపీలో మరో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
లోకేశ్కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!
వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!
వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!
కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..
ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Sports #teamindia
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.